సొంతగడ్డపై పాక్కు షాక్ ! విల్ యంగ్, లేథమ్ సెంచరీలతో న్యూజిలాండ్ విజృంభణ!
Wed Feb 19, 2025 20:22 Sports.202502199955.jpg)
ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్లోనే పాకిస్థాన్ బౌలర్లు తేలిపోయారు. న్యూజిలాండ్తో జరుగుతున్న ఈ మ్యాచ్లో ఆ జట్టు బ్యాటర్లను కట్టడి చేయలేక భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ముఖ్యంగా ఆ జట్టు ప్రధాన పేసర్ షహీన్ అఫ్రీదీ దాదాపు 7 ఎకానమీతో పరుగులు ఇచ్చాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. విల్ యంగ్, టామ్ లేథమ్ సెంచరీలతో చెలరేగడంతో న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 320 రన్స్ చేసింది.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా జరుగుతున్న తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు భారీ స్కోరు చేసింది. పాకిస్థాన్లోని కరాచీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్.. తొలుత బౌలింగ్కు ఎంచుకున్నాడు. దీంతో న్యూజిలాండ్ బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. అయితే డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో సొంతగడ్డపై బరిలోకి దిగిన పాక్కు.. కివీస్ బ్యాటర్లు షాక్ ఇచ్చారు. ఏకంగా ఇద్దరు బ్యాటర్లు సెంచరీలు చేయడంతో ఆ జట్టు 300 పైచిలుకు స్కోరు నమోదు చేసింది.
ఇది కూడా చదవండి: జగన్కు మరో బిగ్ షాక్.. వైసీపీ కీలక నేత అరెస్ట్! పోలీసులు వెంటనే రంగంలోకి..
ఈ మ్యాచ్లో పాకిస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. అయితే డెవాన్ కాన్వే (10), కేన్ విలియమ్సన్ (1), డేరిల్ మిచెల్ (10)లు త్వరగానే ఔట్ చేసిన పాక్ బౌలర్లు.. ఆ జట్టు ఫ్యాన్స్ను సంతోష పెట్టారు. అయితే వారి సంతోషం ఎంతో సేపు నిలవలేదు. ఓపెనర్ విల్ యంగ్, వికెట్ కీపర్ టామ్ లేథమ్లు పాక్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ఎడాపెడా ఫోర్లు సిక్సర్లతో చెలరేగిపోయారు. ఈ క్రమంలోనే ఇద్దరూ సెంచరీలు కూడా పూర్తి చేసుకున్నారు.
విల్ యంగ్ (107) సెంచరీ చేసి ఔట్ అయ్యాక.. క్రీజులోకి వచ్చిన గ్లెన్ ఫిలిప్స్ మరింత రెచ్చిపోయాడు. విధ్వంసాన్ని మరో రేంజ్కు తీసుకెళ్లాడు. 39 బంతుల్లోనే 61 రన్స్ చేసి.. జట్టు స్కోరును 300 మార్కు దాటించాడు. దీంతో చివరకు నిర్ణీత 50 ఓవర్లలో న్యూజిలాండ్ 5 వికెట్ల నష్టానికి 320 రన్స్ స్కోరు చేసింది. టామ్ లేథమ్ (104 బంతుల్లో 118 రన్స్) అజేయంగా నిలిచాడు.
వాస్తవానికి ఈ మ్యాచ్లో పాకిస్థాన్ బౌలర్లు సత్తాచాటుతారని, కివీస్ను స్వల్ప స్కోరుకే ఔట్ చేస్తారని ఆ దేశ ఫ్యాన్స్ భావించారు. ఆడేది సొంతగడ్డపై కావడంతో వారి ఈ రేంజ్లో ఆశలు పెట్టుకున్నారు. కానీ కివీస్ బ్యాటర్లు.. పాక్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ముఖ్యంగా ఆ జట్టు ప్రధాన పేసర్ షాహీన్ అఫ్రిదీ బౌలింగ్లో భారీగా పరుగులు రాబట్టారు. వికెట్లు తీయడం కాదు కదా.. అఫ్రిదీ.. కనీసం పరుగులు కూడా నియంత్రించలేకపోయాడు. 10 ఓవర్లలో ఏకంగా 68 రన్స్ సమర్పించుకున్నాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. మరో బౌలర్ హరీస్ రవూఫ్ ఏకంగా 83 రన్స్ ఇచ్చాడు. పాక్ బౌలర్లలో నసీమ్ షా 2, హరీస్ రవూఫ్ 2, అబ్రార్ అహ్మద్ 1 వికెట్ తీశారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!
గుంటూరులో జగన్ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..
రూల్స్.. రూల్స్.. అంటాడు ఈయన పాటించడా.. అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన.!
గుంటూరులో జగన్ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..
అదిరిపోయే గుడ్ న్యూస్.. ఏపీలో 5 సంస్థలు...2 వేల కోట్ల పెట్టుబడులు! వేలల్లో ఉద్యోగ అవకాశాలు!
మిగిలింది మరో 8 రోజులే.. దేశవ్యాప్తంగా రోడ్లన్నీ ప్రయాగ్రాజ్ వైపే..
డిప్యూటీ సీఎం పవన్ తో సీనియర్ నటుడు మర్యాదపూర్వక భేటీ! కారణం ఇదే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Andhrapradesh #Sports #cricket #williyoung #lpakistan #newzealand
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.